*వెల్డింగ్ గ్యాస్ పేలి ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.*

*వెల్డింగ్ గ్యాస్ పేలి ఇద్దరు మృతి*
             *- మరో ముగ్గురికి గాయాలు*
కుప్పం: 
కుప్పం మండల పరిధిలోని తంబిగానిపల్లి సమీపంలో ఓ గ్యాస్ వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేస్తుండగా సిలిండర్  పేలిన ఘటన ఆదివారం చోటుసుకుంది.స్థానికుల కథనం మేరకు వివరాలు.సమీపంలోని గ్రానైట్ పరిశ్రమకు చెందిన క్రేన్ కు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఆ సమయంలో మొత్తం 5 మంది అక్కడ ఉన్నట్టు సమాచారం.అందులో ఇద్దరు అక్కడిక్కకడే మరణించగా, గాయపడిన మరో ముగ్గురు మంజునాథ్(29), గౌస్(32), బాషా(42) లను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.మంజునాథ్ స్వల్ప గాయాలతో బయటపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని పి ఈ ఎస్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ సర్జన్ లు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరుకు రెఫెర్ చేశారు.సంఘటనా స్థలంలో మృతిచెందిన వారు ఏజాజ్,  అప్సర్ లు గా గుర్తించారు.వీరు ఇరువురు కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన వారుగా సమాచారం.*
*ఈ రోజు వార్త*

Comments

Popular posts from this blog

విశాఖపట్నం. 8.5.2020.*గ్యాస్ లీకేజి ఘటన లో గాయపడిKGH లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం పరామర్శించిన డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.*

తేదీ 10.5.20 20సిద్దిపేట జిల్లా న్యూస్....చిన్న *కొండూరు మండలం మందపల్లి వాగు ద్వారా రాముని పట్ల గ్రామంలోని చెక్ డ్యాం నిండడం తో నేడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గంగమ్మ తల్లికి పుష్కల తో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు*

*రేపు రాష్ట్ర బంద్*చంద్రబాబు అరెస్టు రిమాండ్కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని చంద్రబాబు అరెస్టును రిమాండ్ ను ఖండించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కాలని ప్రభుత్వం ఇలా చేసిందని టిడిపి నేతలు మండిపడ్డారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు బందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.